న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి శాన్ఫ్రాన్సిస్కో బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానాన్ని(Air India Flight) రష్యాకు దారి మళ్లించిన విషయం తెలిసిందే. విమానం ఇంజిన్లో సాంకేతిక లోపం తలెత్తడంతో దాన్ని రష్యాని మగదాన్ విమానాశ్రయంలో మంగళవారం అత్యవసరంగా దించారు. అయితే ఆ విమానంలో ఉన్న 232 మంది ప్రయాణికులను శాన్ఫ్రాన్సిస్కోకు తరలించేందుకు ఎయిర్ ఇండియా ఇవాళ ప్రత్యేక విమానాన్ని పంపుతోంది. మధ్యాహ్నం ఒంటి గంటకు ముంబై నుంచి ఆ విమానం రష్యాకు వెళ్లనున్నది.
మంగళవారం ఢిల్లీ నుంచి అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోకు ఎయిర్ ఇండియాకు చెందిన AI173 విమానం బయలుదేరింది. కొద్దిసేపటి తర్వాత ఓ ఇంజిన్లో సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలెట్ రష్యాలోని సమీపంలోని మగదాన్ విమానాశ్రయాన్ని సంప్రదించి అత్యవసర ల్యాండింగ్కు అనుమతి కోరారు.
విమానంలోని ప్రయాణికులు మగదాన్ లో రాత్రంతా గడిపారు. అయితే అక్కడ జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింథియా తెలిపారు. ఎయిర్లైన్స్ సంస్థతో టచ్లో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. విమానంలో ఆరుగంటల పాటు కూర్చున్న ప్రయాణికులు ఆ తర్వాత ఓ హోటల్ గదిలోకి వెళ్లారు.
Yesterday, @AirIndia flight 173 from Delhi to San Francisco was diverted to Magadan, in rural Russia w/ over 220, mostly elderly, passengers.
Sat in plane for 6 hrs & after 18 hrs now, no word from Air India, @MEAIndia.
Here is a just taken video from a jittery passenger : pic.twitter.com/n6qymnvXrc
— Tarun Shukla (@shukla_tarun) June 7, 2023
మగదాన్ పట్టణం మాస్కోకు దాదాపు 10వేల కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే హోటల్స్ సరిపోను లేని కారణంగా ప్రయాణికుల్ని డార్మిటరీల్లో ఉంచారు.