Ahmednagar | ముంబై, మార్చి 13 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలోని అహ్మద్నగర్ పేరు మారింది. ఇక నుంచి ఆ నగరాన్ని పుణ్యశ్లోక్ అహల్యాదేవి నగర్గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో పాటు పుణె జిల్లాలోని వెల్హే తాలూకా పేరును రాజ్గఢ్గా మార్చారు. అలాగే బ్రిటిష్ కాలంలో పెట్టిన ఎనిమిది రైల్వే స్టేషన్లకు పేర్లను మార్చడానికి క్యాబినెట్ ఆమోదించింది.