అహ్మదాబాద్: గుజరాత్లో గత కొన్ని రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దాంతో రాష్ట్రంలోని పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. అహ్మదాబాద్ ఎయిర్పోర్టులోకి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరింది. దాంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టెర్మినల్ ఏరియాలతోపాటు రన్వే పైకి కూడా వరద నీరు వచ్చి చేరింది.
దాంతో ప్రయాణికులు సమయానికి తమ ఫ్లైట్ను చేరుకోవడంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. మోకాళ్ల లోతు నీళ్లలో ప్రయాణికులు అటూ ఇటూ నడవాల్సి వస్తున్నది. అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వరద పరిస్థితిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఈ ఎయిర్పోర్టులో విమానాలు ఎగరడం కష్టమని, పడవలు సులభంగా పరుగులు తీస్తాయని ఓ నెటిజన్ పేర్కొన్నాడు.
ఇదిలావుంటే ఎయిర్పోర్టులోంచి వరద నీటిని తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. గత 28 ఏళ్లలో అహ్మదాబాద్ ఎయిర్పోర్టును వరదలు ముంచెత్తడం ఇదే తొలిసారని వారు తెలిపారు. ఇదిలావుంటే గత 48 గంటల నుంచి గుజరాత్లో ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. దాంతో పలు ప్రాంతాల్లో వరదలు పోటెత్తాయి.
This is the situation of Ahmedabad airport, #Gujarat after 28 years of BJP rule.
This is the model state of Narendra Modi.#GujaratRain pic.twitter.com/KpiwKu4AIq
— Deepak Khatri (@Deepakkhatri812) July 23, 2023