Quarry explotion : తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో బుధవారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని కారియాపట్టి శివారులోని అవియార్ క్వారీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు. ఈ పేలుడు ఘటనతో స్థానికంగా కలకలం చెలరేగింది.
పేలుడు సమాచారం అందిన వెంటనే పోలీసులు, విరుదునగర్ అగ్నిమాపక విభాగం సిబ్బంది హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.