ఇటానగర్: అరుణాచల్ ప్రదేశ్కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారారు. కాంగ్రెస్, నేషనలిస్ట్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ)కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. (Arunachal MLAs Join BJP) రాష్ట్ర రాజధాని ఇటానగర్లో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి పెమా ఖండూ సమక్షంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నినాంగ్ ఎరింగ్, వాంగ్లిన్ లోవాండాంగ్తోపాటు ఎన్పీపీ శాసనసభ్యులు ముచ్చు మితి, గోకర్ బాసర్ బీజేపీలో చేరారు. అస్సాం మంత్రి, అరుణాచల్ బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ అశోక్ సింఘాల్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కాగా, నలుగురు ఎమ్మెల్యేల చేరికతో అరుణాచల్ ప్రదేశ్లో అధికారంలో ఉన్న బీజేపీకి అసెంబ్లీలో సంఖ్యా బలం పెరిగింది. మొత్తం 60 మంది సభ్యుల్లో ప్రస్తుతం బీజేపీకి 56 మంది శాసన సభ్యులున్నారు. కాంగ్రెస్కు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండగా, మరో ఇద్దరు స్వతంత్ర సభ్యులు. లోక్సభ ఎన్నికలతో పాటు అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. దీనికి ముందు కాంగ్రెస్, ఎన్పీపీకి చెందిన ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడం ప్రాధాన్యత సంతరించుకున్నది.