న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) లోక్సభ ఎన్నికలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ‘ఆప్ కా రామరాజ్య’ వెబ్సైట్ను బుధవారం ప్రారంభించింది. (AAP Ka RamRajya) రాముడి ఆదర్శాలను సాకారం చేసేందుకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రయత్నించారని ఆ పార్టీ పేర్కొంది. ఆప్ నేతలు సంజయ్ సింగ్, అతిషి, సౌరభ్ భరద్వాజ్, జాస్మిన్ షా ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం ‘రామరాజ్యం’ భావనతో పని చేసిందని తెలిపారు. ‘రామరాజ్యం’ సాకారం కోసం ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గత పదేళ్లలో అద్భుతమైన విజయాలు సాధించారని చెప్పారు. మంచి పాఠశాలలు, మొహల్లా క్లినిక్లు, ఉచిత తాగు నీరు, ఉచిత విద్యుత్తు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు.
కాగా, మద్యం పాలసీ కేసులో అరెస్టై జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, శ్రీరామ నవమి రోజున తన ప్రజల మధ్య లేకపోవడం ఇదే తొలిసారి అని సంజయ్ సింగ్ తెలిపారు. తప్పుడు సాక్షుల వాంగ్మూలం ఆధారంగా నమోదు చేసిన నిరాధార కేసులో అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేసి జైలుకు పంపారని ఆరోపించారు.