న్యూఢిల్లీ: వృద్ధురాలి మెడలోని గొలుసును ఒక వ్యక్తి లాక్కొన్నాడు. కదుతులున్న రైలు నుంచి బయటకు దూకేశాడు. (Youth Jumps Out Of Moving Train) ఈ షాకింగ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నెల 13న రైలులో ప్రయాణించిన వృద్ధులైన ఇద్దరు మహిళలు టాయిలెట్ రూమ్కు వెళ్లారు. ఆ కంపార్ట్మెంట్ డోర్ వద్ద ఒక యువకుడు వేచి ఉన్నాడు. ఇద్దరు మహిళలు టాయిలెట్ నుంచి బయటకు వచ్చి తమ సీట్ల వద్దకు వెళ్తున్నారు. ఇంతలో ఆ యువకుడు ఉన్నట్టుండి ఒక వృద్ధురాలి మెడలోని గొలుసును లాక్కొన్నాడు. ఆ వెంటనే కదులుతున్న రైలు నుంచి బయటకు దూకేశాడు. అతడు గాయపడి ఉంటాడని అనుమానిస్తున్నారు.
కాగా, ఆ రైలు ఏసీ కోచ్లో ఉన్న సీసీటీవీలో ఇది రికార్డైంది. దీంతో ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రైలులో జరిగిన చైన్ చోరీ వీడియో చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. ఇండియన్ రైళ్లలో సీసీటీవీ కెమెరాలు ఎప్పుడు ఏర్పాటు చేశారని ఒకరు ప్రశ్నించారు.
*While traveling in a train be careful* pic.twitter.com/6EDtRiEhXS
— Narayanan R (@rnsaai) March 26, 2024