Afzal Ansari | 2005లో బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్ ( BJP MLA Krishnanand Rai) కిడ్నాప్, మర్డర్ కేసులో గ్యాంగ్స్టర్ ముక్తార్ అన్సారీ (Mukhtar Ansari)కి పదేళ్ల జైలుశిక్ష పడిన విషయం తెలిసిందే. ఈ శిక్షను ఘాజిపూర్ కోర్టు ఖరారు చేసింది. 5 లక్షల జరిమానా కూడా చెల్లించాలని ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు (MP MLA court) ఆదేశించింది. ఈ కేసులో ముక్తార్ అన్సారీతో పాటు ఆయన సోదరుడు బీఎస్పీ ఎంపీ (BSP MP) అఫ్జల్ అన్సారీ (Afzal Ansari )ని కూడా దోషిగా తేల్చిన కోర్టు.. ఆయనకు నాలుగేళ్లు జైలు శిక్ష విధించింది. దీంతోపాటు రూ. లక్ష జరిమానా విధించింది.
అఫ్జల్ అన్సారీ ప్రస్తుతం ఘాజీపూర్ ఎంపీగా (Lok Sabha MP) ఉన్నారు. కోర్టు తీర్పుతో ఆయన తన లోక్ సభ సభ్యత్వాన్ని (Lose Lok Sabha Membership) కోల్పోనున్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 8లోని ఆర్టికల్ 102(1)(ఈ) నిబంధన ప్రకారం రెండేండ్లు లేదా అంతకంటే ఎక్కువ జైలుశిక్ష పడిన వ్యక్తి తీర్పు వెలువడిన తేదీ నుంచి రాజ్యాంగ పదవుల్లో ఉండటానికి అర్హత కోల్పోతారు. జైలు శిక్షాకాలంతోపాటు మరో ఆరేండ్లపాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకూ అనర్హులవుతారు. సెక్షన్ 8లో పేర్కొన్న నేరాలకు ఈ అనర్హత వేటు వర్తిస్తుంది. ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) 2019 పరువు నష్టం కేసులో దోషిగా తేలడంతో కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నిబంధలన ప్రకారం.. లోక్సభ సెక్రటేరియట్ రాహుల్పై అనర్హత వేటు వేసింది. దీంతో ఆయన తన ఎంపీ సభ్యత్వాన్ని కోల్పోవాల్సి వచ్చింది.
అఫ్జల్ అన్సారీ గురించి..
ఘాజీపూర్ ఎంపీ అఫ్జల్ అన్సారీ (Afzal Ansari) తన రాజకీయ జీవితాన్ని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) తో ప్రారంభించారు. 1985లో మొదటిసారి ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 1989, 91, 93, 96 వరకు వరుసగా సీపీఐ పార్టీ తరఫున విజయం సాధించారు. అనంతరం 1996 ఎన్నికల్లో ఎస్పీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. అనంతరం 2002 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి చెందిన కృష్ణానంద్ రాయ్ ( Krishnanand Rai) చేతిలో ఆయన ఓడిపోయారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో 2004లో పార్టీ ఆయనకు లోక్సభ టిక్కెట్ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో బీజేపీకి చెందిన మనోజ్ సిన్హాపై విజయం సాధించారు. 2005 నవంబర్ 29న ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్ హత్య తర్వాత అతనిపై బలమైన కేసులు నమోదయ్యాయి. కోర్టులో ఎన్నో అభియోగాల అనంతరం ఆయన జైలుకు వెళ్లాడు. జైలుకు వెళ్లే సమయంలో సమాజ్ వాదీ పార్టీ (SP)తో రాజకీయ విభేదాల కారణంగా 2019 లోక్సభ ఎన్నికల్లో ఘాజీపూర్ పార్లమెంట్ స్థానం నుంచి బీఎస్పీ (BSP) టికెట్పై పోటీ చేశారు. ప్రస్తుతం ఆయన ఘాజీపూర్ ఎంపీగా ఉన్నారు.
Also Read..
Azam Khan | అతీక్లాగే నన్నూ కాల్చి చంపుతారేమో.. అజామ్ ఖాన్ కీలక వ్యాఖ్యలు
Mukhtar Ansari: ముక్తార్ అన్సారీకి పదేళ్ల జైలుశిక్ష
liquor dispensing machine | చెన్నైలో ఎనీ టైం మద్యం మెషీన్లు.. క్యూ కడుతున్న మందుబాబులు