కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని సందేశ్ఖాలీ(Sandeshkhali)లో హింసను ఖండిస్తూ ఇవాళ బీజేపీ ఆందోళన చేపట్టింది. నార్త్ 24 పర్గనాస్ జిల్లాలో ఉన్న సందేశ్ఖాలీ వెళ్లేందుకు బీజేపీ నేతలు ప్రయత్నించారు. అయితే ప్రతిపక్షనేత సువేందు అధికారిని తొలుత పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో హైడ్రామా చోటుచేసుకున్నది. ఆ తర్వాత ఆయన సందేశ్ఖాలీ వెళ్లారు. కోల్కతా హైకోర్టు పర్మిషన్ ప్రకారమే ఆయన సందేశ్ఖాలీ వెళ్లారు.
బీజేపీతో పాటు సీపీఎం నేతలు కూడా ఇవాళ సందేశ్ఖాలీ వెళ్లే ప్రయత్నం చేశారు. ఆ రెండు వర్గాలను పోలీసులు అడ్డుకున్నారు. సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన ఆదేశాలు ఉన్నా.. వారిని పోలీసులు నిలువరించారు. సువేందు అధికారి నేతృత్వంలోని బీజేపీ, బృందా కారత్ నేతృత్వంలోని సీపీఎం నేతలు సందేశ్ఖాలీ వెళ్లారు.
తమను అడ్డుకుని, మమతా బెనర్జీ హైకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తున్నారని సువేందు అధికారి ఆరోపించారు.