భువనేశ్వర్, డిసెంబర్ 31: ఒడిశాలోని ఒక హోటల్లో ఓ ఎంపీతో సహా ఇద్దరు రష్యన్ల మరణాలపై మిస్టరీగా కొనసాగుతుండగానే.. ఆ రాష్ట్రంలోనే ఆండ్య్రూ గ్లాగొలేవ్ అనే మరో రష్యన్ కనిపించకుండా పోవడం కలకలం రేపింది. అయితే అతన్ని భువనేశ్వర్ రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ మార్కెట్ వద్ద గుర్తించామని, కస్టడీలోకి తీసుకొన్నట్టు జీఆర్పీ అధికారులు శనివారం వెల్లడించారు.
అతని వీసా గడువు ముగిసిందని, భారత్లో ఆశ్రయం కోసం ఐక్యరాజ్యసమితికి దరఖాస్తు చేసుకొన్నాడని తెలిపారు.తాను రష్యన్ శరణార్ధిని అని, రష్యా అధ్యక్షుడు పుతిన్కు, ఉక్రెయిన్పై ఆయన చేస్తున్న యుద్ధానికి వ్యతిరేకిని అని ఆండ్య్రూ గతంలో ప్లకార్డుతో కనిపించాడు.