న్యూఢిల్లీ: ఒక ఐఏఎస్ అధికారి తన కుక్కతో ఈవినింగ్ వాక్ చేసేందుకు స్థానిక స్టేడియానికి వస్తున్నారు. దీంతో ఆ సమయంలో స్టేడియంలోకి క్రీడాకారులను రానివ్వకుండా సిబ్బంది అడ్డుకుంటున్నారు. ఇది ప్రభుత్వం దృష్టికి రావడంతో క్రీడాకారుల కోసం స్టేడియం వేళలను పొడిగించింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. ఢిల్లీ ప్రభుత్వం ఆధ్వర్యంలోని త్యాగరాజ్ స్టేడియంలో పలువురు క్రీడాకారులు శిక్షణ పొందటంతోపాటు ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే ఢిల్లీ ప్రిన్సిపల్ సెక్రటరీ (రెవెన్యూ) సంజీవ్ ఖిర్వార్ సాయంత్రం వేళ ఆ స్టేడియానికి వచ్చి తన కుక్కతో కొంతసేపు నడుస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టేడియం సిబ్బంది క్రీడాకారులను ముందుగానే అక్కడి నుంచి పంపివేస్తున్నారు. దీంతో క్రీడాకారులు అసంతృప్తి వ్యక్తం చేయడంతోపాటు ఫిర్యాదు చేశారు.
ఈ వ్యవహారంపై మీడియాలో వార్తలు రావడంతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. క్రీడాకారులకు అనుగుణంగా చర్యలు చేపట్టారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని స్టేడియం వేళలను రాత్రి పది గంటల వరకు పొడిగించారు. ఢిల్లీ ఉప ముఖ్యమత్రి మనీష్ సిసోడియా ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని గురువారం వెల్లడించారు.
News reports have brought to our notice that certain sports facilities are being closed early causing inconvenience to sportsmen who wish to play till late nite. CM @ArvindKejriwal has directed that all Delhi Govt sports facilities to stay open for sportsmen till 10pm pic.twitter.com/LG7ucovFbZ
— Manish Sisodia (@msisodia) May 26, 2022