న్యూఢిల్లీ: ఎన్నికల ప్ర చార సమయంలోమోదీ పాల్పడుతున్న కోడ్ ఉల్లంఘనపై తాను చేసిన ఫిర్యాదుపై ఈసీ స్పం దించకపోవడంపై మాజీ ఐఏఎస్ ఈఏఎస్ శర్మ అసంతృప్తి వ్యక్తం చేశారు. మోదీపై చర్యలు తీసుకోవడానికి ఈసీ భయపడుతున్నదా? అని ప్రశ్నించారు. ఇటీవల తమిళనాడు పర్యటన సందర్భంగా మోదీ ఓ సభలో విపక్ష ఇండియా కూటమిపై విమర్శలు చేస్తూ ‘శక్తి, హిందూయి జం’ అంటూ మతసంబంధమైన విషయాలను ప్రస్తావించటాన్ని ఈనెల 22న ఈసీకి రాసిన లేఖలో శర్మ ప్రస్తావించారు.