న్యూఢిల్లీ, మే 9: ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత సోషల్ మీడియాలో ఓట్లు అర్థించడం చట్ట
విరుద్ధం కాదని ఎన్నికల సంఘం వెల్లడించింది. కర్ణాటకలో ఎన్నికల ప్రచారం ముగిసినప్పటికి బీజేపీ సోషల్మీడియాలో ప్రచారం చేస్తున్నదని ఆరోపిస్తూ మంగళవారం కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేసింది.
దీనిపై ఈసీ వివరణ ఇచ్చింది. సెక్షన్ 126 ప్రకారం పోలింగ్ ప్రాంతంలో మాత్రమే ప్రచారం చేయకూడదని తెలిపినట్టు ఈసీ వర్గాలు పేర్కొన్నాయి. సోమవారం సాయంత్రం 6 గంటలకే కర్ణాటకలో ప్రచార పర్వం ముగిసిన సంగతి తెలిసిందే. సోషల్మీడియాలో ప్రచారం చేసుకోవచ్చని, ఓట్లను కోరవచ్చని ఈసీ చెప్పినట్టు తెలుస్తున్నది.