న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఏప్రిల్ 26న జరిగే లోక్సభ రెండో విడత ఎన్నికల బరిలో పోటీచేస్తున్న 250 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులున్నాయి. మొత్తం పోటీలో ఉన్న వారిలో 33% మంది కోటీశ్వరులే.
మొత్తం 1198 మంది అభ్యర్థుల్లో 1192 అభ్యర్థుల వివరాలు సేకరించగా, అందులో 21% లేదా 250 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. ముగ్గురిపై హత్య, 24 మందిపై హత్యాయత్నం కేసులున్నాయి.