బెంగళూరు : ఇస్రో ప్రయోగించిన ఆదిత్య-ఎల్1 శాటిలైట్ లక్ష్యం దిశగా వడివడిగా పయనిస్తున్నది. భూ కక్ష్యలను పూర్తి చేసుకొని భూ ట్రాన్స్ఫర్ కక్ష్యలోకి ప్రవేశించిన ఆదిత్య-ఎల్1 తాజాగా భూ ప్రభావ గోళాన్ని విజయవంతంగా దాటింది. భూ ఉపరితలం నుంచి 9.2 లక్షల కిలోమీటర్ల దూరంలోని భూ ప్రభావ గోళాన్ని దాటి సూర్యుడి వైపు ఆదిత్య-ఎల్1 పరుగులు పెడుతున్నదని తెలిపింది. ఈ మేరకు ఎక్స్లో ఇస్రో వెల్లడించింది. ‘భూ ప్రభావ గోళాన్ని విజయవంతంగా దాటి వెళ్లగలిగే శాటిలైట్ను భారత్ ప్రయోగించడం ఇది రెండోసారి. గతంలో మార్స్ ఆర్బిట్ మిషన్ను మొదటిసారిగా ప్రయోగించింది’ అని ఇస్రో తెలిపింది.