న్యూఢిల్లీ : బ్రిటన్లోని భారత సంతతికి చెందిన అదితి శంకర్కి ప్రత్యేక మూత్రపిండాల మార్పిడి చికిత్స జరిగింది. ఈ అవయవాన్ని శరీరం తిరస్కరించడాన్ని ఆపడానికి ఎక్కువ కాలం మందులను వాడవలసిన అవసరం లేదు. బ్రిటన్లో మూత్రపిండాల మార్పిడి శస్త్ర చికిత్స జరిగిన తర్వాత ఇమ్యునోసప్రెసివ్ మెడికేషన్ అవసరంలేని మొదటి రోగిగా అదితి నిలిచింది. అదితి స్కిమ్కేస్ ఇమ్యునో-ఒస్సెయుస్ డిస్ప్లాసియా వ్యాధితో బాధపడుతున్నది.