Adhir Ranjan Chowdhury | న్యూఢిల్లీ, జూన్ 21: గీతా ప్రెస్కు గాంధీ శాంతి బహుమతి ఇవ్వాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం గురించి తనకేమాత్రం తెలియదని కాంగ్రెస్ ఎంపీ, అవార్డు ఎంపిక కమిటీ సభ్యుడైన అధీర్ రంజన్ చౌదరి స్పష్టం చేశారు. గాంధీ ఆశయాలకు విరుద్ధంగా వ్యవహరించిన గీతా ప్రెస్కు ఇటీవల కేంద్రం గాంధీ శాంతి బహుమతిని ప్రకటించడంపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. ‘ఆ ఎన్నిక కమిటీలో సభ్యులైన మీరు గీతా ప్రెస్ను అవార్డుకు ఎంపిక చేసినప్పుడు ఏం చేస్తున్నారు?’
అని లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరిని మీడియా ప్రశ్నించింది. దీనిపై ఆయన స్పందిస్తూ అవార్డు కమిటీ సమావేశానికి తనను పిలువలేదని, అలాగే గీతా ప్రెస్కు అవార్డు ఇస్తున్నట్టు కూడా తనకు చెప్పలేదని ఆయన వెల్లడించారు. సమావేశానికి ఆహ్వానం పంపకపోవడంపై ప్రభుత్వాన్ని నిలదీస్తారా అన్న ప్రశ్నకు దీనిపై తానెందుకు ప్రభుత్వానికి లేఖ రాయాలని ఆయన వ్యాఖ్యానించారు.