న్యూఢిల్లీ, మే 3: మెక్కార్మిక్ స్విట్జర్లాండ్ కంపెనీ నుంచి ప్రముఖ బాస్మతీ రైస్ బ్రాండ్ కోహినూర్తో పాటు పలు ఇతర బ్రాండ్లను కూడా కొనుగోలు చేసినట్టు అదానీ విల్మర్ మంగళవారం ప్రకటించింది. కొనుగోలు వివరాలు వెల్లడించలేదు. ఈ కొనుగోలు ద్వారా ఇండియాలో కోహినూర్ బ్రాండ్ పేరిట ఉన్న బాస్మతీ రైస్తో పాటు ‘రెడీ టు కుక్’, ‘రెడీ టు ఈట్’ వంటి కర్రీలు, మీల్స్ పోర్టుఫోలియోపై అదానీ విల్మర్కు విక్రయ హక్కులు దక్కనున్నాయి. కొనుగోలు తర్వాత బాస్మతీ రైస్ మార్కెట్లో 12% షేర్తో అదానీ విల్మర్ మరింత బలోపేతం కానున్నది.