న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: దేశీయ కుబేరులు ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీల మధ్య పోటీ తీవ్రస్థాయిలో నెలకొన్నది. ఇప్పటి వరకు దేశీయ కుబేరుడగా కొనసాగుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ర్యాంక్కు గౌతమ్ అదానీ గండికొట్టారు. ప్రస్తుత సంవత్సరంలో గౌతమ్ అదానీ సంపద 24 బిలియన్ డాలర్లు పెరిగి 100 బిలియన్ డాలర్ల క్లబ్లో చేరారు. తాజాగా బ్లూంబర్గ్ బిలియనీర్ల ఇండెక్స్లో ఈ విషయం వెల్లడైంది. దీంతో ఆయన ప్రపంచ టాప్-10 కుబేరులైన ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్ల సరసన చేరారు. ముకేశ్ అంబానీ 99 బిలియన్ డాలర్ల సంపదతో ఈ జాబితాలో చోటు కోల్పోయారు. గడిచిన రెండేండ్లలో అదానీ గ్రూపు షేర్లు వెయ్యి శాతానికి పైగా పెరిగాయి.