న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: మన శత్రు దేశమైన చైనాతో అదానీ సంస్థకు లింకులున్నాయని తెలిసి కూడా మోదీ ప్రభుత్వం దేశంలోని పలు పోర్టుల నిర్వహణను వారికే ఎందుకు కట్టబెడుతున్నదని కాంగ్రెస్ నిలదీసింది.
ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ తైవాన్కు చెందిన వాన్ హై లైన్స్ డైరెక్టర్కు చైనా సంస్థతో సంబంధం ఉందన్న కారణంతో కేంద్రం 2022 లో సెక్యూరిటీ క్లియరెన్స్ను నిరాకరించిందన్నారు. ఇప్పుడు అదే దేశంతో సంబంధాలు ఉన్న అదానీ కంపెనీలు దేశంలోని పోర్టులు నిర్వహించడానికి ఎలా అనుమతిచ్చారని నిలదీశారు.