పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ సందర్భంగా ఆ రాష్ట్ర సీఎం మమతాబెనర్జీని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, ఆయన కొడుకు జీత్ అదానీ మర్యాదపూర్వకంగా కలిశారు.
పశ్చిమబెంగాల్లో రూ,10 వేల కోట్లు పెట్టుబడులు పెడుతామని గౌతమ్ అదానీ చెప్పారు. కాగా, సమ్మిట్లో మమత మాట్లాడుతూ.. పారిశ్రామికవేత్తలను కేంద్ర దర్యాప్తు సంస్థలు వేధించకుండా కేంద్రానికి చెప్పాలంటూ బెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధన్కర్ను కోరారు.