Prakash Raj | మరికొన్ని రోజుల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు (Karnataka state elections) జరగనున్నాయి. ఈ తరుణంలో కన్నడ స్టార్ నటుడు (Kannada movie star), ‘ఈగ’ ఫేమ్ కిచ్చా సుదీప్ (Kiccha Sudeep) బీజేపీకి మద్దతు ప్రకటించడం హాట్టాపిక్గా మారింది. కర్ణాటకలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కిచ్చా సుదీప్ బీజేపీకి మద్దతుగా నిలవడం ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj ) తాజాగా స్పందించారు. సుదీప్ నిర్ణయం తనను విస్మయానికి గురి చేసిందన్నారు.
‘సుదీప్ నిర్ణయం నన్న విస్మయానికి గురిచేసింది. నేను ఎంతో బాధపడ్డా. నిరాశలో కూరుకుపోయిన బీజేపీ ఈ నకిలీవార్తను వ్యాప్తి చేసిందని నేను గట్టిగా నమ్ముతున్నాను. సుదీప్ ఒకరి ఎరలో పడేంత తెలివితక్కువ వ్యక్తి కాదు’ అని ప్రకాశ్ రాజ్ అన్నారు. ఈ అంశంపై పలువురు కాంగ్రెస్ నేతలు కూడా స్పందించారు. బీజేపీ ఎవరినైనా ప్రభావితం చేయగలుగుతుందని అన్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ఇటీవల షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్కుమార్ గతవారం ఎన్నికల తేదీలను ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు. మే 10న ఎన్నికలు జరగనున్నాయి. అదే నెల 13న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. 224 అసెంబ్లీ సీట్లున్న కర్ణాటకలో ప్రస్తుతం బీజేపీకి 119, కాంగ్రెస్కు 75, జేడీఎస్కు 28 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నది. రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి.
Also Read..
Kuno National Park | కూనో నేషనల్ పార్క్ నుంచి పారిపోయిన మరో చీతా..!
India Corona | 5 వేలకు పైనే కొత్త కేసులు.. 25 వేలు దాటిన యాక్టివ్ కేసులు!
Cape Cobra | విమానం గాల్లో ఉండగా.. కాక్పిట్లో ప్రత్యక్షమైన కేప్ కోబ్రా.. !