ముంబై, మార్చి 28 (నమస్తే తెలంగాణ): బాలీవుడ్ నటుడు గోవిందా అహుజా మళ్లీ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీలో గురువారం చేరారు. ముంబైలోని నార్త్వెస్ట్ లోక్సభ స్థానం ఆయన పోటీచేసే అవకాశం ఉన్నది.
గోవింద 2004 లోక్సభ ఎన్నికల్లో ఉత్తర ముంబై నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. కాగా, బాలీవుడ్ నటీమణులు కరిష్మా కపూర్, కరీనా కపూర్ కూడా గురువారం సీఎం షిండేను కలిశారు. వారు కూడా రానున్న ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని అంటున్నారు.