మంగళూరు: దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరులో బీజేపీ నేతల ఫొటోలకు ఆ పార్టీ కార్యకర్తలే చెప్పుల దండ వేశారు. బీజేపీకి కంచుకోటగా భావించే ఈ నియోజకవర్గంలో ఓడిపోవడంపై ఆగ్రహించిన ఆ పార్టీ కార్యకర్తలు మాజీ సీఎం డీవీ సదానంద గౌడతో పాటు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ నలిన్ కుమార్ ఫొటోలకు చెప్పుల దండ తగిలించారు.
కమలం పార్టీ అభ్యర్థికి 37 వేల ఓట్లు రాగా, 66 వేల ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు.