బోథ్ ఎమ్మెల్మే రాథోడ్ బాపురావ్
అభివృద్ధి పనులు ప్రారంభం
భీంపూర్, జూలై 2 : అందరి బంధువు సీఎం కేసీఆర్ అని, ఆయన అమలు చేస్తున్న పథకాలు, చేస్తున్న పల్లెప్రగతి పనులు చరిత్రలో అజరామరంగా నిలిచిపోతాయని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అభివర్ణించారు. భీంపూర్లో పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పాల్గొన్నారు. రూ.22 లక్షలతో పూర్తయిన రైతువేదిక భవనం, రూ.13 లక్షలతో నిర్మించిన పంచాయతీ భవనం, రూ.12.65 లక్షల క్రిమిటోరియం, రూ.2.36 లక్షలతో పూర్తయిన కంపోస్టు షెడ్ను ప్రారంభించా రు. రూ.25.29 లక్షల విలువైన కల్యాణలక్ష్మి, రూ.2 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. భీంపూర్లో గ్రామస్తులు కేటాయించిన స్థలంలో రూ.3.50 కోట్లతో నిర్మించనున్న కస్తూ ర్బా విద్యాలయ భవనం, పాఠశాల అదనపు గదుల కోసం భూమిపూజ చేశారు. మహిళలకు ఇంటికోసం మొక్కలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పేద, మధ్యతరగతి వర్గాలు, రైతులకు అవసరమైన అన్ని పథకాలు అమలు చేస్తున్నదన్నారు. పల్లెప్రగతిలో ఇంకా కావాల్సిన పనులను స్థానికులే నిర్ణయించుకోవాలని సూచించారు. బోథ్ నియోజకవర్గం దళితబస్తీ సహా అన్ని అభివృద్ధి పనుల్లో రాష్ట్రంలోనే ముందున్నదన్నారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని, అందుకు అం దరూ బాధ్యత తీసుకోవాలని పే ర్కొన్నారు. గ్రామాల్లో రాజకీయాలు పక్కనపెట్టి ప్రగతికోసం కలిసిరావాలని పిలుపునిచ్చారు. రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, జడ్పీటీసీ లు తాటిపెల్లి రాజు, కుమ్ర సుధాకర్, ఎంపీపీ కుడిమెత రత్నప్రభ, వైస్ ఎంపీపీ గడ్డం లస్మన్న, స ర్పంచ్ మడావి లింబాజీ, ఉపసర్పంచ్ జాదవ్ రవీందర్, రైతుబంధు సమితి గ్రామ అధ్యక్షుడు ఉత్తంరాథోడ్, టీఆర్ఎస్ మండల కన్వీనర్ మేకల నాగయ్య, ప్రత్యేకాధికారి గోపీకృష్ణ, డీఈవో రవీందర్, డీఈ శివరాం, తహసీల్దార్ సోము, ఎంపీడీవో శ్రీనివాస్, అటవీశాఖాధికారులు గులాబ్, కేశవ్, ఏవో రవీందర్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు జి.నరేందర్ యాదవ్, కుడిమెత సంతోష్, ఏనుగు అశోక్రెడ్డి, గోవర్ధన్ యాదవ్, ఎం.కల్చాప్యాదవ్, రమణ, తదితరులు పాల్గొన్నారు.
కుమారిలో విగ్రహాల ఆవిష్కరణ
నేరడిగొండ, జూలై 2 : మండలంలోని కుమారి గ్రామంలో వీడీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ, అంబేద్కర్ విగ్రహాలను ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ ఆవిష్కరించారు. మహనీయులు పుట్టిన దేశంలో వారి స్మారకార్థం గ్రామంలో విగ్రహాల ఏర్పాటు హర్షణీయమన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. అనంతరం రైతు వేదిక వద్ద మొక్కలు నాటి నీళ్లు పోశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ అనిల్ జాదవ్, ఎంపీపీ రాథోడ్ సజన్, వైస్ ఎంపీపీ ఏలేటి మహేందర్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ దావుల భోజన్న, సర్పంచ్ రాజుయాదవ్, ఎంపీటీసీ స్వాతి, పీఏసీఎస్ చైర్మన్ మందుల రమేశ్, టీఆర్ఎస్ మండల కన్వీనర్ అల్లూరి శివారెడ్డి, గడ్డం భీంరెడ్డి, నాయబ్ తహసీల్దార్ రాజేశ్వరి, సీనియర్ అసిస్టెంట్ మీరాబాయి, వీడీసీ చైర్మన్ అరుణ్గౌడ్, అడెల్లు, అంబేద్కర్ సంఘం నాయకులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.