వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లోఅన్ని సీట్లూ టీఆర్ఎస్కే
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు ప్రతిపక్షాల గూబ గుయ్యిమనిపించారు
మున్సిపల్ ఎన్నికల్లో వాటి అడ్రస్ గల్లంతే
టీఆర్ఎస్ జోలికి పోవద్దని గుణపాఠం కావాలి
ఎలక్షన్లను పార్టీ కార్యకర్తలు ఆషామాషీగా తీసుకోవద్దు
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
డివిజన్ ఇన్చార్జిలతో సమీక్షలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
హన్మకొండ, ఏప్రిల్ 19 : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ క్లీన్స్వీప్ చేయడం ఖాయమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిపక్షాల గూబగుయ్యిమనిపించేలా ప్రజలు తీర్పు ఇచ్చా రని అన్నారు. సోమవారం హసన్పర్తిలోని కేఎల్ఎన్ గార్డె న్, హన్మకొండలోని మయూరి గార్డెన్లో గ్రేటర్ పరిధిలో ని 66 డివిజన్ల టీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జిలతో ఎర్రబెల్లి సమీక్షించారు. మంత్రులు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, సత్యవతిరాథోడ్ హాజరై నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రతిపక్షాల అడ్రస్ గల్లంతు కావడం ఖా యమన్నారు. టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ జోలికిపోవద్దని ప్రతిపక్షాలకు గుణపాఠం వచ్చేలా ప్రజలు తీర్పు ఇ వ్వాలని కోరారు. అన్ని సర్వేల్లో మనకే అనుకూలంగా ఉన్నాయన్నారు. అయినా ఈ ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దని, ప్రతి ఒక్కరూ చాలెంజ్గా పనిచేసి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు.
అనంతరం మంత్రులు ఈటల, కొప్పుల, సత్యవతి మాట్లాడుతూ.. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ సమష్టిగా పనిచేసి అన్ని డివిజన్ల అభ్యర్థులను బంపర్ మెజార్టీతో గెలిపించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేయాలన్నారు. ఈ 15రోజులు తామే అభ్యర్థులుగా మిషన్ మోడ్లో పనిచేయాలని సూచించారు. ఈ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు అసలు చోటే లేదన్నారు. వాళ్లకు డిపాజిట్లు కూడా దక్కవని పేర్కొన్నారు. అన్ని డివిజన్లలో ప్రతి ఓటరును కలిసి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరించాలని కోరారు. ముఖ్యంగా బీజే పీ అబద్ధాలు, అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలన్నా రు. అభివృద్ధి చేస్తున్నది, చేసేది టీఆర్ఎస్ పార్టీయేనని ప్రజలు నమ్ముతున్నారని అన్నారు. సమావేశంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, చీఫ్విప్ వినయ్భాస్కర్, ఎంపీ దయాకర్రావు, ఎమ్మెల్సీ శ్రీహరి, ఎమ్మెల్యేలు సుదర్శన్రెడ్డి, నరేందర్, సతీశ్కుమా ర్, వెంకటరమణారెడ్డి, సుంకే రవిశంకర్, దాసరి మనోహార్రెడ్డి, టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ రాంమ్మోహన్, జడ్పీ చైర్మన్లు సుధీర్ కుమార్, బిందు, నాయకుడు జన్ను జకార్య పాల్గొన్నారు.