విమానంలో ఏసీ చెడిపోవడంతో ముగ్గురు ప్రయాణికులు మూర్ఛపోయారు. చాలామందికి ముచ్చెమటలు పట్టాయి. ప్రయాణికులందరూ హాహాకారాలు చేశారు. ఈ ఘటన డెహ్రాడూన్-ముంబై జీ8 2316 విమానంలో జరిగింది. దీన్ని కొంతమంది ప్రయాణికులు వీడియో తీసి సోషల్మీడియాలో పెట్టగా వైరల్గా మారింది. గో ఎయిర్ విమాన సంస్థకు భారీ ఎదురుదెబ్బ తగిలింది.
గో ఫస్ట్ ఎయిర్వేస్ ఫ్లైట్లోని ప్రయాణికులు ఏసీ సిస్టమ్పై ఫిర్యాదు చేస్తున్నట్లు వీడియోలో కనిపిస్తున్నది. చాలా మంది ప్రయాణికులకు విపరీతంగా చెమటలు పట్టాయి. గాలికోసం మ్యాగజైన్లతో విసురుకోవడం కనిపించింది. ఊపిరి పీల్చుకోలేక పోతున్న ఒక మహిళను మరొక మహిళ ముందు సీట్లోకి తీసుకెళ్లింది. విమానంలో క్యాన్సర్ రోగి ఉన్నారని, చాలా భయపడిపోతున్నారని ఓ మహిళ అరవడం వినిపించింది. విమానంలో ముగ్గురు వ్యక్తులు స్పృహ తప్పి పడిపోయారని, మెజారిటీ ప్రయాణికులు చెమటలు కక్కుతూ అసౌకర్యానికి గురయ్యారని వీడియోలోని టెక్ట్స్ లో కనిపించింది. ఈ వీడియో చూసినవారంతా గో ఎయిర్ విమాన సంస్థపై మండిపడుతున్నారు.
@GoFirstairways G8 2316 was one of the worst experiences!With Ac’s not working & a full flight,suffocation struck passengers had no way out,sweating profusely paranoid passengers were on the verge of collapsing.3 ppl fainted,a chemo patient couldn’t even breathe.#complaint pic.twitter.com/mqjFiiQHKF
— Roshni Walia (@roshniwalia2001) June 14, 2022