న్యూఢిల్లీ : పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లో నియంత్రణ రేఖ (LoC) వెంబడి డజనుకుపైగా టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్లో మళ్లీ యాక్టివ్గా ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్లో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఇంటెలిజెన్స్ నివేదికను ఉటంకిస్తూ.. ఓ అధికారి మాట్లాడుతూ.. దాదాపు 200 మంది ఉగ్రవాదులు కశ్మీర్లోకి చొరబడేందుకు పీవోకేలోని లాంచ్ప్యాడ్ వద్ద ఉన్నారని పేర్కొన్నారు. ముప్పును దృష్టిలో పెట్టుకొని సరిహద్దు భద్రతా దళం (BSF) చొరబాటు ప్రయత్నాలను నిలువరించేందుకు కృషి చేస్తున్నాయని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ అధికారి తెలిపారు.
ఉగ్రవాదులు జమ్మూ కశ్మీర్లోకి చొరబడేందుకు టన్నెల్, నదీ తీర ప్రాంతాలను ఉపయోగించుకోడం నేర్చుకుంటున్నారని తెలిపారు. వారికి లష్కరే తోయిబా, జైష్ ఏ మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్తో సంబంధాలున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఉగ్రవాదులు అనుసరిస్తున్న చాలా మార్గాలు బహిర్గతమయ్యాయని, ఈ క్రమంలో సొరంగాలు, నదీ తీర ప్రాంతాల నుంచి చొరబడేందుకు యోచిస్తున్నారని అధికారి చెప్పారు. పీర్ పంజాల్కు దక్షిణంగా ఉన్న రాజౌరీ – పూంచ్ మార్గాల్లో ఇప్పుడు ఉగ్రవాదులు చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారని మరో అధికారి తెలిపారు.