(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలను ఇస్తామంటూ మాటతప్పిన కేంద్రంలోని బీజేపీ సర్కారు ఉపాధి హామీ పథకాన్ని కూడా క్రమంగా నిర్వీర్యం చేస్తున్నది. గడిచిన ఆరు నెలల వ్యవధిలో (ఏప్రిల్-సెప్టెంబర్, 2023) 80 లక్షల మంది జాబ్ కార్డులను తొలగించింది. ఈ మేరకు ఎన్జీవో సంస్థ ‘లిబ్టెక్ ఇండియా’ తాజాగా వెల్లడించింది. కార్డుల తొలగింపులో బీజేపీ పాలిత యూపీ, మధ్యప్రదేశ్ తొలి రెండు స్థానాల్లో ఉండగా తర్వాతి స్థానాల్లో కాంగ్రెస్ పాలిత ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ర్టాలు ఉన్నాయి. కాగా, వేతన చెల్లింపులకు ఆధార్ అనుసంధానాన్ని తప్పనిసరి చేస్తూ ఏబీపీఎస్ విధానాన్ని తీసుకురావడం వల్లే కార్డుల తొలగింపు పెద్దయెత్తున జరిగినట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఆరు నెలల వ్యవధిలో ఏ రాష్ట్రంలో ఎన్ని కార్డులు తొలగించారంటే?