కోల్కతా : పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధంకర్పై టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం మమతా బెనర్జీని అవమానించడంలో ముందుండే గవర్నర్ బీజేపీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పుడు మాత్రం మౌనం దాల్చుతారని మండిపడ్డారు. న్యాయవ్యవస్ధపై ఎంపీ చేసిన వ్యాఖ్యలపై ఆయనకు, గవర్నర్కు మధ్య మాటల యుద్ధం సాగుతున్న నేపధ్యంలో అభిషేక్ బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు.
పలు కేసుల్లో సీబీఐ విచారణకు కోర్టులు ఉత్తర్వులు జారీ చేయడంపై డైమండ్ హార్బర్ ఎంపీ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. ముఖ్యమంత్రి మేనల్లుడు, టీఎంసీ ఎంపీ న్యాయవ్యస్ధ గురించి దిగజారుడు వ్యాఖ్యలు చేశారని, న్యాయ ప్రక్రియలో జోక్యం చేసుకునేలా వ్యవహరించారని గవర్నర్ మండిపడ్డారు.
టీఎంసీ ఎంపీ హద్దు మీరి పలు కేసుల్లో సీబీఐ దర్యాప్తునకు ఉత్తర్వులు జారీ చేసిన న్యాయవ్యవస్ధను కించపరుస్తున్నారని వ్యాఖ్యానించారు. కాగా హల్దియాలో ఓ బహిరంగ సభలో అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ కొందరు వ్యక్తులను కాపాడేందుకు న్యాయవ్యవస్ధలో ఒకరిద్దరు కేంద్రంతో లాలూచీ పడ్డారని చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. ఇక బెంగాల్ గవర్నర్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జగ్దీప్ ధంకర్ సీఎం మమతా బెనర్జీతో పలు అంశాల్లో ఘర్షణ ధోరణితో ముందుకువెళుతున్నారు.