Punjab Poll | పంజాబ్ ఎన్నికల నేపథ్యంలో ఆమ్ఆద్మీ మరింత యాక్టివ్ అయ్యింది. సీఎం అభ్యర్థిగా భగవంత్ మాన్ను ప్రకటించాలని పబ్లిక్ పల్స్లో డిమాండ్ రావడంతో కేజ్రీవాల్ ఆయన్నే సీఎం అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో ఆప్ మరింత దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, ఆప్ మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతూనే వుంది. తాజాగా ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్, కాంగ్రెస్ సీఎం చెన్నీకి సవాల్ విసిరారు. దమ్ముంటే ధురీ నుంచి తనపై పోటీలోకి దిగాలని భగవంత్ మాన్ సీఎం చెన్నీకి సవాల్ విసిరారు. సీఎం చెన్నీ నియోజకవర్గం చమ్కౌర్ సాహిబ్ నుంచి నేను బరిలోకి దిగలేను. ఎందుకంటే అది రిజర్వ్డ్ స్థానం. ఆయన మాత్రం ధురీ నుంచి బరిలోకి దిగొచ్చు. నేను స్వాగతం చెబుతున్నాను. అంటూ భగవంత్ పేర్కొన్నారు.