న్యూఢిల్లీ: రాజ్యసభలో బీజేపీలో ఏడుగురు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీల విలీనానికి రాజ్యసభ చైర్మన్ రాధాకృష్ణన్ సోమవారం అధికారికంగా ఆమోదం తెలిపారు. దీంతో రాజ్యసభలో బీజేపీ బలం 113కు చేరగా, ఆప్ బలం మూడుకు పడిపోయింది. రాఘవ్ చద్దా, హర్భజన్ సింగ్, స్వాతి మాలీవాల్ సహ ఏడుగురు ఆప్ ఎంపీలు ఒకేసారి బీజేపీలోకి ఫిరాయించిన విషయం తెలిసిందే. వారంతా ప్రస్తుతం బీజేపీలో విలీనమయ్యారు.
విలీనం తర్వాత తమను బీజేపీ ఎంపీలుగానే పరిగణించాలని కోరుతూ ఈ ఏడుగురు ఎంపీలు రాజ్యసభ చైర్మన్కు వినతిపత్రం సమర్పించగా, తాజాగా దానిని ఆయన ఆమోదించారు. రాజ్యసభ అధికారిక వెబ్సైట్ ప్రకారం, ఈ ఏడుగురు ఎంపీలు ఇప్పుడు బీజేపీ సభ్యుల జాబితాలో ఉన్నారు. ఈ ఏడుగురు ఎంపీల సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ ఆప్ ఆదివారం రాజ్యసభ చైర్మన్కు వినతిపత్రం సమర్పించింది.