న్యూఢిల్లీ: న్యాయపరమైన చిక్కులతో ఇబ్బంది పడుతున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు సొంత పార్టీ నుంచి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. పంజాబ్లో ఆ పార్టీకి గల ఏకైక ఎంపీ సుశీల్ కుమార్ రింకు, ఎమ్మెల్యే శీతల్ అంగురల్ బుధవారం బీజేపీలో చేరారు.
సుశీల్ మీడియాతో మాట్లాడుతూ.. జలంధర్ అభివృద్ధి కోసం తాను బీజేపీలో చేరినట్లు తెలిపారు. కాగా, బీజేపీలో చేరితే రూ.20-25 కోట్లు ఇస్తామని తమకు ఆఫర్లు వస్తున్నాయని ముగ్గురు ఆప్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. బీజేపీ ఆపరేషన్లోటస్ ప్రారంభించిందని ఆప్ ఆరోపించింది.