న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కేసులో బుధవారం అరెస్టయిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ను ఐదు రోజుల పాటు ఈడీ కస్టడీకి ఢిల్లీ కోర్టు అప్పగించింది. ఆయనను ఈడీ ఈ నెల 10 వరకు ప్రశ్నించవచ్చు. గడువు ముగిసిన తర్వాత ఆయనను కోర్టులో హాజరుపరుస్తారు.
‘మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా?’ అని కోర్టు ప్రశ్నించినపుడు సింగ్ మాట్లాడుతూ, అమిత్ అరోరా, దినేశ్ అరోరా అనేక స్టేట్మెంట్లు ఇచ్చారని, అప్పట్లో వారు తన పేరును ప్రస్తావించలేదని, ఇప్పుడు హఠా త్తుగా వారికి తన పేరు గుర్తుకొచ్చి ందని చెప్పారు. తనకు కనీసం ఒకసారి అయినా సమన్లు ఇవ్వలే దని, తనకు ప్రత్యేక చట్టం ఎందుకు అమలవుతున్నదని ప్రశ్నించారు. దినేశ్ అరోరా నుంచి తాను రూ.2 కోట్లు స్వీకరించినట్లు ఈడీ చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు.