AAP | న్యూఢిల్లీ : బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత( MLC Kavitha )కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు( ED Notice ) జారీ చేయడంపై ఆమ్ ఆద్మీ పార్టీ( AAP ) మండిపడింది. కవితకు ఈడీ నోటీసులపై ఆ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ స్పందించారు.
విపక్షాలను వేధించాలనే ఉద్దేశంతోనే కవిత ఈడీ నోటీసులు జారీ చేసిందన్నారు. ప్రశ్నించిన వారిపై బీజేపీ( BJP Party ) పిచ్చెక్కినట్లు వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఈడీ, సీబీఐ( CBI )లకు బడ్జెట్ పెంచండి అని కేంద్రానికి చురకలంటించారు. గల్లీ గల్లీకి ఈడీ, సీబీఐ శాఖలు పెట్టి అరెస్టులు చేయండి అని విమర్శించారు. అభివృద్ధి, సంక్షేమం బీజేపీకి అవసరం లేదన్నారు.