దేశానికి కాంగ్రెస్ ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాదని ఆప్ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా అన్నారు. కేవలం కేజ్రీవాల్ మాత్రమే ప్రధాని మోదీకి సవాల్ విసరగలరని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఓ చనిపోయిన గుర్రమని, దానిని ఎన్ని కొరడాలతో కొట్టినా.. అది పరిగెత్తదని ఎద్దేవా చేశారు. వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో భేటీ అయిన నేపథ్యంలో ఆయన పై వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ ప్రభుత్వాలు ఎన్నటికీ మంచి పాఠశాలలను నిర్మించలేవని, కేవలం నిరక్షరాస్య గూండాలను మాత్రమే తయారు చేస్తుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేవలం ఉపాధి అవకాశాలను కూడా కల్పించలేవని, ఎంత సేపటికీ హింసాత్మక ఎజెండాతోనే ముందుకు సాగుతారని రాఘవ్ చద్దా విమర్శించారు.