న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యేకు ఈడీ నోటీసులు జారీ చేసింది. దీంతో ఈ కేసులో తాఖీదులు అందుకున్న ఎమ్మెల్యేల సంఖ్య నాలుగుకు చేరింది. ఇప్పటికే ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్, ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఎమ్మెల్యే అమానుతుల్లా ఖాన్కు దర్యాప్తు సంస్థ నోటీసులు అందజేసింది. తాజాగా ఈ జాబితాలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే దుర్గేశ్ పాఠక్ (Durgesh Pathak) చేరారు. విచారణకు రావాలని దుర్గేశ్కు ఈడీ తాఖీదులు అందించింది.
అయితే దీనిపై మనీష్ సిసోడియా ఆగ్రహం వ్యక్తంచేశారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికల ఇంచార్జ్ అయిన దుర్గేశ్కు.. ప్రభుత్వ లిక్కర్ పాలసీతో ఏం సంబంధముందని ప్రశ్నించారు. ఈడీ టార్కెట్ లిక్కర్ పాలసీయా లేకా ఎంసీడీ ఎన్నికలా అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
आज ED ने “आप” के MCD के चुनाव इंचार्ज दुर्गेश पाठक को समन किया है। दिल्ली सरकार की शराब नीति से हमारे MCD चुनाव इंचार्ज का क्या लेना देना? इनका टार्गेट शराब नीति है या MCD चुनाव?
— Manish Sisodia (@msisodia) September 19, 2022