న్యూఢిల్లీ : హర్యానా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పావులు కదుపుతోంది. స్ధానిక పోరులో సత్తా చాటాలని భావిస్తున్న ఆప్ గురుగ్రాంలో ఆగస్ట్ 4,5 తేదీల్లో రెండు రోజుల పాటు చింతన్ శిబిరం నిర్వహిస్తోంది. ఈ మేథోమధన సదస్సులో ఆప్ రాజ్యసభ ఎంపీలు, ఢిల్లీ ఎమ్మెల్యేలు పాల్గొంటున్నారు.
హర్యానా రాజకీయాలపై చర్చించే ఈ సదస్సులో ఢిల్లీ రాజ్యసభ ఎంపీ, హర్యానా ఇన్చార్జ్ సుశీల్ గుప్తా, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్, ఢిల్లీ ఎమ్మెల్యే సౌరవ్ భరద్వాజ్, పంజాబ్ రాజ్యసభ ఎంపీ సందీప్ పాధక్ తదితరులు హాజరవుతారు. త్వరలో జరిగే ఫరీదాబాద్, గురుగ్రాం, మనేసర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలను రాబట్టేందుకు ఆప్ హర్యానా శాఖ కసరత్తు సాగిస్తోంది.