న్యూఢిల్లీ: దేశ రాజధానిలో పాలనాధికారాల నియంత్రణకు కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్పై ఢిల్లీ సర్కార్ శుక్రవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేంద్రం వైఖరికి నిరసనగా ఈ నెల 3న ఆర్డినెన్స్ ప్రతులను దహనం చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ అనుకున్నా, వివాదం కోర్టు పరిధిలో ఉండటంతో ఆ నిర్ణయాన్ని విరమించుకొంది. కేంద్రం అన్యాయంగా ఈ ‘నల్ల ఆర్డినెన్స్’ను తీసుకొచ్చిందని ఆప్ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ విమర్శించారు. మే 19న బీజేపీ నేతృత్వంలోని కేంద్రం ఈ ఆర్డినెన్స్ను తీసుకొచ్చింది.