హర్యానా వేదికగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. దేశంలోని రైతులందరూ కలిసి… అధికార బీజేపీ అహంకారాన్ని తీసేశారని పేర్కొన్నారు. త్రేతాయుగంలో రామచంద్రుడు రావణుడి అహాన్ని అణచి వేశారని, ద్వాపర యుగంలో కృష్ణుడు కంసుడి అహాన్ని తొలగించారని, ఈ కలియుగంలో రైతులు బీజేపీ అహాన్ని అణచేశారని పేర్కొన్నారు.
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆదివారం హర్యానాలోని కురుక్షేత్రలో పర్యటించారు. ఈ సందర్భంగా బీజేపీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. హర్యానాలో తాము ఏం చేశామో చెప్పుకోడానికి కూడా బీజేపీ దగ్గర ఏమీ లేదని ఎద్దేవా చేశారు. ఈసారి తమకు అధికారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హర్యానాలోని పాఠశాలలన్నింటినీ బాగు చేసేస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు ఢిల్లీ పాఠశాలలే తార్కాణమని వివరించారు.
తమకు ఒక్కసారి అధికారమిస్తే.. అంతా మార్చి చూపిస్తామని, పాఠశాలలను పూర్తిగా మార్చేస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ భార్య భారత పర్యటనకు వచ్చినప్పుడు కేజ్రీవాల్ స్కూల్ చూస్తానని, మోదీతో అన్నారని గుర్తు చేసుకున్నారు. గత 7 సంవత్సరాలుగా తాము ప్రైవేట్ పాఠశాలల ఫీజు పెంపుకు కూడా అంగీకరించలేదన్నారు.
दिल्ली और पंजाब के बाद “ #अब_बदलेगा_हरियाणा ”। धर्मनगरी कुरुक्षेत्र में श्री @ArvindKejriwal जी की जनसभा | LIVE https://t.co/saQ8WihC8r
— AAP (@AamAadmiParty) May 29, 2022