చండీగఢ్: పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీఎం అభ్యర్థిగా భగ్వంత్ మన్ను ఎంపిక చేసినట్టు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వెల్లడించారు. మంగళవారం పంజాబ్లోని మొహాలీకి చేరుకున్న కేజ్రీవాల్ మాట్లాడుతూ ‘పంజాబ్ ఆప్ సీఎం అభ్యర్థిగా ఎవరిని ప్రకటించాలన్న దానిపై అభిప్రాయా న్ని చెప్పాలంటూ ప్రజలను కోరాం. అత్యధికులు భగ్వంత్ మన్ను ప్రకటించాలని సూచించారు. అందుకే ఈ నిర్ణయం’ అని పేర్కొన్నారు.