న్యూఢిల్లీ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయంతో ఊపు మీదున్న ఆప్ ఇక ఈ ఏడాది డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్పై దృష్టిసారించింది. ఢిల్లీ, పంజాబ్ తర్వాత ఇప్పుడు గుజరాత్ ఆప్ను కోరుతోందని ఆ పార్టీ గురువారం ట్వీట్ చేసింది.
ఇక ఈ ఏడాది ఏప్రిల్లో గుజరాత్లో తిరంగా యాత్రను చేపట్టడం ద్వారా మిషన్ గుజరాత్కు ఆ పార్టీ శ్రీకారం చుట్టనుంది. ఈ యాత్ర గుజరాత్లోని అన్ని జిల్లాలు, గ్రామ పంచాయితీలు, తెహసిల్స్ను చుట్టివచ్చేలా సాగుతుంది. ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం అభ్యర్ధి భగవంత్ మాన్ త్వరలోనే గుజరాత్లో పర్యటించనున్నారు.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 117 స్ధానాలకు గాను ఆప్ ఏకంగా 92 స్ధానాల్లో గెలుపొంది ఘన విజయం సాధించింది. పాలక కాంగ్రెస్ కేవలం 18 స్ధానాలకు పరిమితం కాగా, ఎస్ఏడీ కూటమి నాలుగు స్ధానాలు దక్కించుకోగా, కాషాయ పార్టీ దాని మిత్రపక్షాలు రెండు స్ధానాలను గెలుచుకున్నాయి.