న్యూఢిల్లీ, మే 5: ‘సామాజిక భద్రత చట్టం-2020’ పరిధిలోకి వచ్చే సేవలు, పథకాలకు ఆధార్ సంఖ్య తప్పనిసరి అని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ ప్రకటించింది. దీని ప్రకారం ఉద్యోగులతోపాటు అసంఘటిత రంగ కార్మికులు తమ పేరు నమోదుకు లేదా పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు తమ ఆధార్ సంఖ్యను తెలియజేయాల్సి ఉంటుంది. ఈ మేరకు సోమవారం కార్మికశాఖ ఒక నోటిఫికేషన్ను జారీ చేసింది. అంతర్రాష్ట్ర వలస కార్మికులు కేవలం తమ ఆధార్ సంఖ్యను పొందుపర్చడం ద్వారా కార్మిక శాఖ పోర్టల్లో స్వయంగా పేరు నమోదు చేసుకోవచ్చని పేర్కొంది.