న్యూఢిల్లీ: ఆధార్ ను పౌరసత్వం, నివా స స్థలం, చిరునామా కు రుజువుగా తప్పు గా వినియోగిస్తున్నారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు మంగళవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్పందనను కోరింది. ఆధార్ వినియోగాన్ని గుర్తింపు ధ్రువీకరణ కోసమే పరిమితం చేసేలా అధికారులను ఆదేశించాలని ఈ పిటిషన్లో కోర్టును అభ్యర్థించారు. న్యాయవాది అశిని కుమా ర్ ఉపాధ్యాయ దాఖలు చేసిన ఈ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ వి మోహన్లతో కూడి న ధర్మాసనం కేంద్రం, అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాం తాలకు నోటీసులు జారీ చేసింది.
పాఠశాల ప్రవేశాలు, ఆస్తి కొనుగోళ్లు, జనన ధ్రువీకరణ పత్రా లు, రేషన్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్సులు పొందే ప్రక్రియలో వయస్సు, పౌరసత్వం, నివాసానికి రుజువుగా ఆధార్ను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల అక్రమ వలసదారులు కూడా ఆధార్ ఆధారంగా ఇ తర పత్రాలను పొందుతున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. ఓటరు నమోదు ప్రక్రియపై కూడా పలు ప్రశ్నలు లేవనెత్తారు.