న్యూఢిల్లీ, మార్చి 25: ఆధార్తో రేషన్కార్డు అనుసంధానానికి గడువును జూన్ 30కి పొడిగిస్తున్నట్టు కేంద్రం తెలిపింది. దేశంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆహార ధాన్యా లు అందాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకొన్నట్టు తెలిపింది. తొలుత గతేడాది డిసెంబర్ 31ని తుది గడువుగా నిర్ణయించారు. అనంతరం దాన్ని ఈ ఏడాది మార్చి 31కి పొడిగించారు. తాజాగా మరోసారి గడువు పెంచారు.