న్యూఢిల్లీ, జూన్ 9: కాలుష్యాన్ని పెంచుతూ పర్యావరణానికి హాని చేయాలనుకొంటే టమాటాలు లేని ప్రపంచాన్ని చూడటానికి సిద్ధంగా ఉండాలని డెన్మార్క్ శాస్త్రవేత్తల తాజా అధ్యయనం ఒకటి హెచ్చరించింది. వాతావరణ మార్పుల కారణంగా టమాటాల ఉత్పత్తి తగ్గిపోతున్నదని, రాబోయే ముప్పై ఏండ్లలో సగానికి పడిపోవచ్చని పేర్కొన్నది.
డెన్మార్క్లోని ఆర్హస్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం నిర్వహించారు. ఉష్ణోగ్రతలు పెరిగితే టమాటా ఉత్పత్తిపై ఎలా ప్రభావం పడుతుందన్నదానిపై విశ్లేషించారు. ఉష్ణోగ్రతలు 5 డిగ్రీలను దాటితే 2050కల్లా టమాటా ఉత్పత్తి సగానికి పడిపోతుందన్నారు. భారత్లో ఇటీవల వడగాలుల కారణంగా టమాటా ఉత్పత్తి తగ్గి ధరలు భగ్గుమంటున్న సంగతి తెలిసిందే.