భోపాల్: భార్యాభర్తల బంధం ఎంతో పవిత్రమైనది. ఒక్కసారి ఏకమయ్యారంటే కలకాలం కలిసి ఉంటారు. కష్టాలెదురైనా, నష్టాలెదురైనా కలిసే సాగుతారు తప్ప కాపురాన్ని చెడగొట్టుకోరు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోతున్నాయి. పాశ్చాత్య ధోరణులవల్ల పచ్చని కాపురాల్లో చిచ్చురేపుకుంటున్నారు. వికృత చేష్టలతో జీవిత భాగస్వాములు అసహ్యించుకునేదాకా తెచ్చుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘటనే రాజస్థాన్లోని బికనీర్ సిటీలో జరిగింది.
బికనీర్లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో మేనేజర్గా పనిచేసే వ్యక్తి.. తన భార్యను అదే హోటల్కు తీసుకెళ్లాడు. హోటల్లోని ఓ గదిలో ఆమెను రెండు రోజులపాటు బంధించాడు. ఆ తర్వాత మద్యం, మాదకద్రవ్యాల మత్తులో ఆమె దగ్గరకు వెళ్లాడు. తనకు తెలిసిన ఓ జంటతో వైఫ్ స్వాపింగ్ గేమ్ (భార్యలను మార్చుకుని శృంగారం చేయడం) ఆడుదామని ప్రతిపాదించాడు. అందుకు ఆమె ఒప్పుకోలేదు. బెదిరించాడు. అయినా ఆమె భయపడకుండా ఎదురు తిరిగింది.
దాంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన భర్త ఆమెపై దాడికి పాల్పడ్డాడు. విచక్షణారహితంగా కొట్టాడు. ఎలాగోలా అతని బారి నుంచి తప్పించుకున్న బాధితురాలు పుట్టింటికి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భార్యకు చాలా మంది అమ్మాయిలతో వివాహేతర సంబంధాలు ఉన్నాయని, అబ్బాయిలతో శృంగారం చేసే అలవాటు కూడా ఉన్నదని తన ఫిర్యాదులో పేర్కొన్నది. పైగా వివాహం జరిగిన దగ్గరి నుంచి అత్తింటివాళ్లు తనను పుట్టింటి నుంచి రూ.50 లక్షల కట్నం తేవాలని వేధిస్తున్నారని తెలిపింది.
దాంతో కేసు బుక్ చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని, అతని తల్లిని, సోదరిని అదుపులోకి తీసుకున్నారు. వాళ్లపై ఇండియన్ పీనల్ కోడ్లోని 377, 498ఎ, 323, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బాధితురాలి ఒంటిపై తీవ్ర గాయాలు ఉండటంతో ఆస్పత్రిలో చేర్పించారు.