Frontdesk Layoffs | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4 : టెక్ కంపెనీల్లో ఉద్యోగాలు ఎప్పుడు ఊడిపోతాయో తెలియని పరిస్థితి నెలకొన్నది. తాజాగా ఓ కంపెనీలో ఉద్యోగులందర్నీ రెండు నిమిషాల్లో తొలగించారు. అమెరికాకు చెందిన టెక్ కంపెనీ ‘ఫ్రంట్డెస్క్’ సీఈవో.. కేవలం రెండు నిమిషాల గూగుల్మీట్ కాల్తో కంపెనీలోని మొత్తం 200మంది ఉద్యోగులను తొలగించారు.
దివాలా తీసిన కంపెనీగా ముద్ర పడకుండా కంపెనీ యాజమాన్యం ఈ చర్యను చేపట్టినట్టు తెలిసింది. ఈ ఏడాది జనవరిలో ప్రఖ్యాత టెక్ కంపెనీల్లో భారీ ఎత్తున లేఆఫ్స్ ప్రకటిస్తుండటం ఈ రంగంలో ఉద్యోగుల్ని ఆందోళనకు గురిచేస్తున్నది.