Madhya Pradesh | భోపాల్, జూన్ 19: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో దారుణ ఘటన చోటుచేసుకొన్నది. కొందరు ఓ వ్యక్తి మెడకు బెల్ట్ కట్టి, కుక్కలా అరవాలంటూ.. అమానవీయంగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతున్నది.
కొంతమంది బాధితుడి మెడకు బెల్ట్ కట్టి వేధించడం కనిపించింది. అతనిపై గట్టిగా అరుస్తూ.. ‘కుక్కలా ప్రవర్తించు. సాహిల్ భాయ్కు క్షమాపణలు చెప్పు’ అనే మాటలు వినిపించాయి. కాగా, ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల ఇండ్లను అధికారులు బుల్డోజర్లతో కూల్చివేశారు.