ఇండోర్: ఇండోర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో విద్యనభ్యసిస్తున్న ఓ విద్యార్థి రూ.కోటి వార్షిక వేతనంతో జాబ్ కొట్టాడు. ఈ-కామర్స్ సంస్థలు ఇటీవల నిర్వహించిన క్యాంపస్ సెలక్షన్స్లో ఐఐఎం స్టూడెంట్కు ఈ భారీ ప్యాకేజీతో ఆఫర్ వచ్చింది.
ఈ ఏడాది చివరి సెషన్లో ఇదే అత్యధిక ప్యాకేజీ ఆఫర్గా నిలిచింది. ఈ క్యాంపస్ ఎంపికలో 594 మంది స్టూడెంట్స్ను మొత్తం 150 కంపెనీలు ఎంపిక చేసుకున్నాయి. ఓవరాల్గా ఈ ఏడాది పలు కంపెనీలకు ఎంపికైన విద్యార్థుల సగటు వార్షిక వేతనం 25.68 లక్షలు. అత్యధికంగా రూ.కోటి వార్షిక వేతనం ఒక విద్యార్థికి రావటం గమనార్హం. సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగంలో అతనికి ఆఫర్ వచ్చింది.